TG: గల్ఫ్ దేశాల్లో తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎంబసీ జారీ చేసే మార్గదర్శకాలు పాటించాలని పేర్కొన్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. భారత ఎంబసీలతో అధికారులు సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల భద్రత అత్యంత ప్రాధాన్యమని వెల్లడించారు.