E.G: వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఆదివారం తన కార్యాలయంలో రుడా, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో కోట్లాది రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.