KRNL: పెద్దకడుబూరులో రౌడీషీట్ కలిగిన వ్యక్తులకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నిరంజన్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలని, గొడవలు చేయకుండా చట్టాలను గౌరవించాలని సూచించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని, ఏవైనా వివాదాలు ఉంటే చట్టబద్ధ మార్గాల్లో పరిష్కరించుకోవాలని హెచ్చరించారు.