NZB: మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పూలాంగ్ చౌరస్తాలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. మాదిగ ఉపకులాల అభివృద్ధి కోసం అసువులు బాసిన వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.