CTR: సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ. 85,000 చెక్కుని బాధిత కుటుంబానికి అందించినట్లు టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ తెలిపారు. పుంగనూరు పట్టణం కట్ట కింద పాల్యానికి చెందిన మనీ మొదలియార్ సతీమణి ఇందిరాకు CMRF చెక్కును ఆదివారం అందజేశారు. బాధితుల ఆత్మస్థైర్యం పెరగాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.