KKD: రాష్ట్ర సీఎం చంద్రబాబును కాకినాడకు చెందిన సానా సతీష్ కలిశారు. మంగళవారం సాయంత్రం అమరావతిలో సీఎం చంద్రబాబుని కలిసి తనకు రాజ్యసభ టిక్కెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానని సానా సతీష్ పేర్కొన్నారు.