BPT: కొరిసపాడు మండలం రాచపూడిలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న గోవుల వాహనాన్ని గో పరిరక్షణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. వాహనంలోని గోవులను సురక్షితంగా కిందకు దించిన సభ్యులు, అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గో సంరక్షణ కోసం తమ పోరాటం ఇలాగే కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. నిదితులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.