PLD: వినుకొండలో ఆదివారం శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.