CTR: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప పేర్కొన్నారు. ఆదివారం పుంగనూరు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తడి చెత్త-పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.