MHBD: కురవి మండలంలోని కందికొండ గుట్ట శివారు అడవి ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందంటూ రెండు రోజులుగా ప్రచారం సాగుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ SHO ఆఫీసర్ రాణి, బీట్ ఆఫీసర్ ప్రత్యూష పాదముద్రలను పరిశీలించారు. అవి పెద్దపులి పాదముద్రలు కాదని, దాదాపు 12 సంవత్సరాలు దాటిన జంగపిల్లి పాదముద్రలు అని తేల్చారు. దీంతో రైతులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.