NDL: డోన్ RTC డిపో నుంచి ప్రతి ఆదివారం వాల్మీకి గుహలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ చలపతి తెలిపారు. డోన్ నుంచి ఉదయం 9.30 గంటలకు బస్సు బయల్దేరి ప్యాపిలి మండలం చిగురుమాను, నల్లమేకల పల్లి మీదుగా 1.45 గంటలకు వాల్మీకి గుహలకు చేరుకుంటుందన్నారు. తిరిగి సాయంకాలం 5.15 గంటలకు బయల్దేరి 6.30 గంటలకు డోను చేరుకుంటుందని, ఛార్జీ రూ.45 ఉంటుందన్నారు.