MLG: మేడారం మహా జాతర విజయవంతానికి అందరూ పట్టుదలతో కృషి చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ సాయంత్రం మేడారంలో జాతర అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో 251 కోట్లతో చేపట్టిన పనుల్లో 95% పూర్తయ్యాయని, మిగిలిన 5% పనులను త్వరలో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.