VSP: జనసేన పార్టీ నగర కార్యాలయంలో క్రియాశీల (ఉద్యమి) సభ్యత్వ నమోదుపై శనివారం ముఖ్య సమావేశం జరిగింది. నగర (పార్లమెంట్) అధ్యక్షుడు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తూర్పు, ఉత్తర నియోజకవర్గాల నాయకులతో చర్చించారు. సభ్యత్వంపై కార్యకర్తల సందేహాలు తెలుసుకుని నివృత్తి చేశారు. ప్రతి కార్యకర్త ఉద్యమి సభ్యత్వాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలన్నారు.