NLR: కందుకూరులోని శ్రీరామనగర్ కాలనీ స్వర్ణ వార్డు సచివాలయం-9ను ఎమ్మెల్యే నాగేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించబోమని, ఫిర్యాదులు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.