BHPL: మున్సిపాలిటీ 6వ వార్డు క్రిష్ణాకాలనీలో శనివారం వార్డు కౌన్సిలర్ రేణుక-గణపతి ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందితో కాలనీలో పేరుకుపోయిన చెత్తను ఎత్తించి, బ్లీచింగ్ పౌడర్ చెల్లించారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ.. వార్డును ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు.