JN: పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో రేపు డాక్టర్ ఏలే శిరీష్మ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ మాచర్ల స్వరూప తెలిపారు. ఈ శిబిరంలో వివిధ రకాల వ్యాధులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.