సత్యసాయి: కదిరి మండలంలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వద్ద నిర్వహించిన ధ్వజారోహణం కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.