NLG: చిట్యాల, 7వ వార్డు కమ్యూనిటీ హాల్లోని వాటర్ ప్లాంట్ సామాగ్రిని నిన్న రాత్రి అక్రమంగా తొలగించారు. ఈ చర్యను నిరసిస్తూ.. మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ లింగస్వామి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. తీసుకొచ్చిన సామాగ్రిని తిరిగి అమర్చి నీటి సౌకర్యాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తూ కమిషనర్కు వినతి ఇచ్చారు.