నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం పీఎం శ్రీ జిల్లాస్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఈఓ భోజన్న ప్రారంబించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటూ క్రీడల్లో రాణించాలని అన్నారు. జిల్లాలోని ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.