KMR: మద్నూర్ స్థానిక మార్కెట్లో శనివారం క్వింటా పత్తి ధర రూ.7,300 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం అమ్మకానికి పరిగె పత్తి మాత్రమే వస్తోందని, మరో ఇరవై రోజుల్లో వ్యాపారం పూర్తిగా ముగిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఖరీఫ్లో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గిందని దీంతో రెండు నెలల ముందే మార్కెట్ ముగింపు దశకు చేరుకుందన్నారు.