RR: బాల్య వివాహాలను అరికట్టే విషయంలో బాధ్యతగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బాల్య వివాహ విముక్త ప్రచార రథయాత్రను షాద్నగర్ పట్టణంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో నేటికీ బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని, వాటి నిర్మూలన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.