AP: విజయనగరం జిల్లాలో ఇవాళ CM చంద్రబాబు పర్యటించనున్నారు. రావివలస గ్రామంలో NTR భరోసా పింఛన్లను సీఎం పంపిణీ చేయనున్నారు. రావివలసలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బాలికలతో మాట్లాడనున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొననున్నారు. సాయంత్రం TDP కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రాత్రికి అమరావతికి చేరుకోనున్నారు.