ELR: ఆగిరిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తోందని తెలిపారు. నూజివీడు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు.