MDCL: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంలో డాట్ల ఫౌండేషన్ కృషి అభినందనీయమని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా తెలిపారు. కౌకూర్ ZPHS పాఠశాలలో డాట్ల ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను శుక్రవారం ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ పూర్ణిమ, ఎంఈవోలు మనోహర్, మురళికృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.