‘నందూస్ వరల్డ్’ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు రమా నందన ఆమె భర్త మధుకర్లపై భారీ వీసా మోసం ఆరోపణలు వచ్చాయి. యూకే వర్క్ పర్మిట్, వీసా రెన్యూవల్ పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.15-20 లక్షలు వసూలు చేస్తూ 50 మందికి పైగా మోసగించారని బాధితులు పేర్కొన్నారు. దీనిపై ఇబ్రహీంపట్నం పీఎస్లో కేసు నమోదైంది. అయితే ఈ ఆరోపణలను నందన ఖండిస్తూ..ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది.