SRPT: తెలంగాణ సాయుధ పోరాట యోధులు, స్వాతంత్ర సమరయోధులు, కామ్రేడ్ చిల్లంచర్ల రఘునాథం సతీమణి చిల్లంచర్ల వరలక్ష్మి మృతి అత్యంత బాధాకరమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందిన ఆమె పార్థివ దేహాన్ని ఆయన సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుబటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.