ADB: ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ప్రవేశాల లక్ష్యంగా బడి బాటను విజయవంతం చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితా రాణా అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలను బలోపేతం చేయడం, నూతన డిజిటల్ విద్యా విధానాల అమలుపై చర్చించినట్లు పేర్కొన్నారు.