కోనసీమ: అమలాపురంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అభిమానులు బుధవారం సాయంత్రం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పుల్లయ్య రామాలయం శ్రీ రామపురం, హైస్కూల్ సెంటర్, గడియార స్తంభం మీదుగా సాగి వీపీసీ థియేటర్ వద్దకు చేరుకుంది. సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.