NTR: ఏ.కొండూరు మండలం కోడూరు గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ప్రధానోపాధ్యాయుడు ఎం.రాం ప్రదీప్ దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే పాఠశాల కోసం రూ.1 లక్ష వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో తల్లిదండ్రులతో మాట్లాడిన ఆయన, దాతల సహకారంతో అన్ని వసతులు కల్పిస్తానన్నారు.