JGL: బీర్పూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ప్రభుత్వ పాఠశాల విశిష్టతలను వివరించారు. ఈ సందర్భంగా బడిబాటకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన సాగుతుందని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఎంఈఓ నాగభూషణం, సర్పంచ్ హరీష్ పాల్గొన్నారు.