ASF: తిర్యాణి వ్యవసాయ శాఖ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. గోడలకు పగుళ్లు వచ్చి, పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతుండటంతో సిబ్బంది, రైతులు భయంతో విధులు నిర్వహిస్తున్నారు. రోజూ 50-60 మంది రైతులు పంట రుణాలు, పథకాలు, ఎరువుల సబ్సిడీ కోసం వస్తుంటారు. ఏ క్షణంలో కూలుతుందో తెలియదు అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.