ASR: స్వచ్ఛ పథం అనేది ప్రతి బుధవారం తప్పనిసరిగా పంచాయతీల్లో నిర్వహించే ఒక నిరంతర పారిశుధ్య ఉద్యమమని కలెక్టర్ నిశాంతి అన్నారు. హుకుంపేట మండలం కొంతిలి ప్రాంతంలో బుధవారం జరిగిన స్వచ్ఛ పథం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పంచాయతీల్లో రోడ్ల పక్కన చెత్త కుప్పలను తొలగించడం, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు.