SRPT: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ‘బడి బాట’ కార్యక్రమంపై గ్రామ సభల్లో ప్రత్యేక చర్చ నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. గ్రామాల్లోని పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేలా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.