WNP: ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈ నెల 5న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు దేవేంద్రనాథ్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 50 ఏళ్లు పైబడిన దృష్టిలోపం గలవారు రావచ్చున్నారు. ఆత్మకూరు, అమరచింత, నర్వ, మదనాపురం మండలాల పరిసర గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.