BPT: కొల్లూరు శివారులోని పొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి, నిందితుల నుంచి రూ. 6,570 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, వారిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై పేర్కొన్నారు.