WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని కారుణ్య జ్యోతి హైస్కూల్లో శుక్రవారం అలుమ్ని మీట్ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో కార్పొరేట్ విద్యను అందిస్తూ ఎంతోమంది పేద విద్యార్థులకు మెరుగైన విద్య అవకాశాలు కల్పించారని అన్నారు.