BPT: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలే కీలకమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన కూటమి ప్రభుత్వం, ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 53,752ల కోట్లు కేటాయించిందని తెలిపారు. ధరల స్థిరీకరణ వంటి కీలక అంశాలపై ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు.