PPM: కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైనఘటనపై ఎంపీడీవో కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాదలింగి పీహెచ్సీ వైద్యాధికారిణి డా.తనూజా మాట్లాడుతూ.. డయేరియా లక్షణాలు లేవని, నిల్వ పచ్చళ్లు తినడం వల్ల విరేచనాలు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్ సందీప్ ఉన్నారు.