PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఆదివారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు.హెల్మెట్ ధరించనవారికి, వాహన పత్రాలు లేని వారికి జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. తనిఖీల సమయంలో సిబ్బందికి సహకరించాలని కోరారు.