PDPL: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరై ముస్లిం మత పెద్దల సమస్యలను తెలుసుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి రంజాన్ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నగర మేయర్ మహంకాళి స్వామి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్జీ-1 జీఎం, వన్ టౌన్ సీఐ ఉన్నారు.