VZM: మహిళలు, బాలికలను వేధిస్తే జైలుకు వెళ్లడం ఖాయమని రామభద్రాపురం SI జ్ఞాన ప్రసాద్ హెచ్చరించారు. శనివారం మండలంలోని పాడివానివలసలో ఉపాధి కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు రక్షణకు కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని తెలిపారు. అలాగే గంజాయి వాడిన, అమ్మిన, రవాణా చేసిన, తాగిన చర్యలు ఉంటాయన్నారు.