NZB: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు అధికారికంగా జరగనున్నాయి. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఉమేశ్ చంద్ర జాదవ్ నేతృత్వంలో ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. జిల్లా నుంచి బంజారా సోదరులు భారీ సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లారు.