VKB: కుల్కచర్ల మండలంలో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రామలింగేశ్వర డిగ్రీ కళాశాలలో 228 మంది విద్యార్థులకు గాను 222 మంది హాజరవ్వగా, 6గురు గైర్హాజరయ్యారు. అలాగే వివేకానంద జూనియర్ కళాశాలలో 294 మందికి గాను 274 మంది హాజరయ్యారని, 20 మంది విద్యార్థులు రాలేదని అధికారులు వెల్లడించారు.