W.G: తెలిసీ తెలియని వయసులో వాహనాలు నడిపి జీవితాలను నాశనం చేసుకోవద్దని భీమవరం వన్టౌన్ సీఐ అనిశెట్టి రమేష్ హెచ్చరించారు. బుధవారం రాత్రి ప్రకాశం చౌక్ కూడలిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో సరైన పత్రాలు, లైసెన్స్ లేని వారికి జరిమానాలు విధించారు. పట్టుబడిన మైనర్లకు సీఐ కౌన్సెలింగ్ ఇస్తూ.. మళ్లీ రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.