KKD: పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగిన నిధుల అవకతవకలపై ప్రభుత్వం మంగళవారం కఠిన చర్యలు చేపట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం నుంచి 55 పనుల నిర్వహణకు రూ.773 లక్షలు మంజూరయ్యాయి. అందులో కొన్ని పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని, పనుల్లో నాణ్యత లేదని విచారణలో అధికారులు నిర్ధారించారు. బాధ్యులకు నోటీసులు జారీ చేశారు.