ఏలూరు తూర్పువీధి శివాలయం వద్ద మంగళవారం చెత్త ట్రాక్టర్ నుంచి మెయిన్ రోడ్డుపై చెత్త పడిపోయింది. రద్దీగా ఉండే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త పడిన విషయం తెలిసినా ట్రాక్టర్ సిబ్బంది పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించాల్సిందిగా కోరారు.