BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని నిన్న భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో దామోదర్ రావు కలెక్టర్కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో రామయ్యకు ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కలెక్టర్కు వేద ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.