NLG: గుండ్లపల్లి(డిండి) మండలం గోనబోయినపల్లి గ్రామానికి దేవరకొండ నుంచి బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ విజయ కుమారికి సోమవారం గ్రామ నాయకులు, ప్రజలు వినతిపత్రం అందజేశారు. గతంలో గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేదని, ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి బస్సును పునరుద్ధరించాలని కోరారు. నిత్యం దేవరకొండకు విద్యార్థులు, ప్రజలు ప్రయాణిస్తుంటారని తెలిపారు.