కోనసీమ: మామిడికుదురు మండలం పాసర్లపూడి బాడవ గురువారం సాయంత్రం పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్సై చైతన్య కుమార్ తన సిబ్బందితో కలిసి దాడి చేసి పేకాట ఆడుతున్న 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 32 వేల నగదు, 8 మోటార్ సైకిళ్లు, 19 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.