AKP: ఈనెల 28న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని నాతవరం ఎంపీడీవో ఎంఎస్.శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. మార్చి 1న ఆదివారం రావడంతో ఒక్కరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. మండలంలో మొత్తం 10,932 మంది పింఛన్ దారులు ఉన్నారని, వీరికి గాను రూ.4.59కోట్లు మంజూరు అయిందన్నారు.